google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు, అక్రమంగా పాఠశాల నందు పాఠ్యపుస్తకాలు అమ్మడం జరుగుతున్న నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ కందుకూరు పట్టణ కమిటీ ఎం.ఈ.ఓ కి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బండి వీరస్వామి మాట్లాడుతూ కందుకూరులోని ప్రైవేట్ పాఠశాలలు ఫీజు నియంత్రణ చట్టాన్ని పాటించట్లేదని విద్యార్థుల దగ్గర్నుంచి ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో నోటీసు బోర్డులో పెట్టట్లేదని విమర్శించారు. ఫీజు వివరాలు నోటీస్ బోర్డ్ లో పెట్టాలని పుస్తకాల్లో అమ్ముకాలు ఆపాలని ఎంఈఓ గారిని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కందుకూరు పట్టణ కన్వీనర్ లలితేష్, కో కన్వీనర్ చరణ్, కన్వినింగ్ కమిటీ సభ్యులు మనోజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.