google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ఉద్యోగ సమాచార్ నుండి 11 మంది ఎంపిక
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపున్యాధి సంస్థ గురువారం నాడు కంభం మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కు విశేష స్పందన లభించినది. ఈ జాబ్ మేళా లో నియోజకవర్గం లోని నిరుద్యోగ యువతి యువకులు దాదాపు 150 మంది పాల్గొన్నారు. ఈ జాబ్ మేళా లో 8 కంపెనీ లు పాల్గొనగా 48 మందికి డిస్ట్రిక్ట్ స్కిల్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ బాబు, కంపెనీ, కళాశాల ప్రిన్సిపల్ సైమన్ బాబు కలిసి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. మార్కాపురం కు చెందిన ఉద్యోగ సమాచార్ కన్సుల్టేన్సీ నుండి 11 మందికి డి ఎస్ డి వో కంచి బాబు, ఉద్యోగ సమాచార్ మేనేజింగ్ డైరెక్టర్ షేక్. సాజిద్ 11 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.అనంతరం ఉద్యోగాలు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో స్కిల్ డెవలప్మెంట్ కో ఆర్డినేటర్ ఫిరోజ్ గాంధీ, యాసిన్, తానిషా, మదన్ తదితరులు పాల్గొన్నారు.