google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
ఈ నెల 27వ తేదీ న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం, క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్ ను ప్రారంభించునున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపియస్.,, జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు గారు . ఎస్ ఎస్ జి డిఎస్పి కె. శివ పోతురాజు , మరియు ఇతర శాఖల అధికారులతో కలిసి ముందస్తు భద్రత సమన్వయం ద్వారా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.ముఖ్యమంత్రి , హెలికాప్టర్ దిగే హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి, అక్కడ జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అదేవిధంగా సీఎం కాన్వాయ్ రూట్ను పరిశీలించి, బందోబస్తు మరియు భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి , పర్యటన సందర్భంగా ప్రతి శాఖకు కేటాయించిన విధులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. హెలిప్యాడ్ ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టడంతో పాటు, ప్రజా వేదికకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ఇతరుల వాహనాలకు వేర్వేరు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ , పోలీసు అధికారులకు ఆదేశించారు.
ముఖ్యమంత్రి , పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించి, తగిన చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ , సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం డి.ఎస్.పి యు. నాగరాజు, కందుకూరు డిఎస్పి బాలసుబ్రమణ్యం, ఏ ఆర్ డి ఎస్పి కె. శ్రీనివాసరావు,ఎస్బి ఇన్స్పెక్టర్ యం.శ్రీనివాసరావు, గిద్దలూరు అర్బన్ సీఐ కె. సురేష్, రూరల్ సీఐ రామకోటయ్య, చీమకుర్తి సీఐ డి ప్రసాద్, పామూరు సీఐ వినోద్ కుమార్, ఆర్ఐ రమణ రెడ్డి మరియు ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు…..