google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
సింగరాయకొండ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ELF) పరిసర ప్రాంతంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ సింగరాయకొండకు చెందిన హరి చెన్నంశెట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు, ఐఏఎస్ గారిని కలెక్టర్ కార్యాలయంలో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ప్రమాదాల వివరాలు, ఇప్పటివరకు చోటుచేసుకున్న ఘటనలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రహదారి భద్రత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.వినతిపత్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్పందిస్తూ, ఈ అంశాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించి తగిన చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.