google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
తాళ్లూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ధర్బార్లో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద మంజూరైన రూ.4,95,059 విలువైన చెక్కులను 9 మంది లబ్ధిదారులకు దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఖరీదైన వైద్యం చేయించుకున్న నిరుపేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా నిలుస్తోందని తెలిపారు. కార్యక్రమంలో డా. కడియాల లలిత్ సాగర్, గంజాం రాఘవేంద్ర, అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.