google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

హెచ్ ఎస్ సి స్వచంద సంస్థ అధినేత తాటి పర్తి సుధాకర్ పిలుపు.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
కుటుంబ సభ్యుల ను కోల్పోయిన వారికి ఆత్మీయులు ఇచ్చే ఓదార్పు ఊరట తో పాటు మనో ధైర్యాన్ని ఇస్తుందని ప్రముఖ స్వచంద సంస్థ హెచ్ ఎస్ సి అధినేత తాటి పర్తి సుధాకర్ పేర్కొన్నారు. రాజకీయ సామాజిక, సేవారంగంలో తమతో కలిసి పనిచేసే ఊళ్ల పాలెం శంభుని రెడ్డి పాలానికి చెందిన గౌరవరపు రాగమ్మ మృతికి ఆయన ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఆమె చిత్ర పటానికి నివాళులు అర్పించారు. గత కొంత కాలంగా ఈ గ్రామం తో తాటి పర్తి కుటుంబానికి సన్నిహిత సంబంధం ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. కార్యకర్తలు, మద్దతు దారులు సన్నిహితుల కు తమ కుటుంబం తోడుగా ఉంటుందని ఆయన రాజమ కుటుంబ సభ్యులకు తెలిపారు. కుటుంబ సభ్యులు రాజమ్మ మృతి తో కుంగి పోకుండా కలిసి కట్టుగా కుటుంబాన్ని ముందుకు తీసుకు పోవాలని హితవు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంట ఊళ్ల పాలెం శంభుని రెడ్డి పాలానికి చెందిన తమ మద్దతు దారులు గౌరవరపు అంకమ్మ రెడ్డి, దేవర్ రెడ్డి,రఘుబాబు, సురేంద్ర, రామకృష్ణ,అనిల్, పుచ్చలపల్లి వెంకట్రావు పాల్గొన్నారు.