google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జూలై 4, 2026న నిర్వహించనున్న శ్రీ తిరుమలనాథ స్వామి తిరునాళ్ల సందర్భంగా భక్తులకు సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు మార్కాపురం జిల్లా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.తిరునాళ్లకు సుమారు 50,000 మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్దారవీడు ఎస్ఐ ఆలయాన్ని సందర్శించి తిరునాళ్ల ఏర్పాట్లు, భద్రతా చర్యలు, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.అదేవిధంగా త్రిపురాంతకం సీఐ తిరునాళ్ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, దొంగతనాలు లేదా అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు సిబ్బందికి ఆదేశించారు.భక్తులు గుమిగూడే ప్రాంతాలు, ఆలయ పరిసరాలు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, ప్రధాన రహదారులు మరియు తిరునాళ్ల ప్రాంతమంతటా సీసీటీవీ కెమెరాలు మరియు డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు, అత్యవసర సేవల సమన్వయంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.తిరునాళ్లకు విచ్చేసే భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సమీపంలో ఉన్న పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని మార్కాపురం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.