
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరులో కుల, మతలకతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలు అయిన వితంతవులైన నడవలేని వారికి ఇంటికి సరిపడ నిత్యావసర సరుకులు ఈ రోజు లబ్ది దారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ,ప్రతి ఒక్కరు పేదవారికోసం సామాజిక బాధ్యతగా తోచినంత సహాయం అందిస్తే మరింత మందికి సహాయం అందించే దిశగా ఫౌండేషన్ అడుగులు వేస్తుంది అని ఫౌండేషన్ సెక్రెటరీ షంషేర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు సాజిద్, ట్రజరర్ హాఫీజ్, టౌన్ ఇంచార్జ్ అయూబ్ ఖాన్ పఠాన్, షమ్ షూద్దిన్, అబూ బకర్ పాల్గొన్నారు.