
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
నూతన మార్కాపురం జిల్లా ఓఎస్డిగా నవజ్యోతి మిశ్రా శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.ఈయన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి అడిషనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ గా పని చేస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చారు.2021 ఐపిఎస్ బ్యాచ్ కి చెందిన ఈయన స్వస్థలం బీహార్ రాష్ట్రానికి చెందిన వారు.నూతన ఓఎస్డిగా బాధ్యతలు స్వీకరించిన నవ జ్యోతి మిశ్రాను డీఎస్పీ డాక్టర్ యు నాగరాజు,సీఐ ఎస్ కె.అల్తాఫ్ హుస్సేన్ మరియు ఎస్ఐ లు మర్యాద పూర్వకంగా కలసి బొకే అందజేసి అభినందనలు తెలిపారు.