google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా కంభం మండలంలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కె. మధుర వాణి ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందరితో ప్రతిజ్ఞ చేయించి డెంగ్యూ వ్యాధి యొక లక్షణాలు తెలియజేసి, జ్వర పీడిత బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకోవాలని తెలియచేశారు.
కంభం సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,నీటి తొట్టెల్లో నీరు నిలువ ఉంచుకోకూడదని, పాత టైర్లలో,పారేసిన కొబ్బరి బొండాల్లో నీరు ఉంచడం చేయకూడదని అవి పారేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంభం సబ్ యూనిట్ అధికారి జి.వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది మరియు స్కూల్ సిబ్బంది అమృతవల్లి, వరమ్మ, విద్యార్థినీలు
పాల్గొన్నారు.