google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

చెప్పిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశాం
త్వరలో వెలిగొండ నుంచి నీళ్లు అందిస్తాం
మంత్రి డా. డోలా శ్రీ బాల o
తొలి శుభోదయం న్యూస్ త్రిపురాంతకం : -
హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం త్రిపురాంతకంలోని శ్రీ బాలత్రిపుర సుందరిదేవి ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి డా. స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, యర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, మ్యారిటైం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య తో కలిసి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆలయ కమిటీ సభ్యుల చేత మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…వైసీపీ హయాంలో హిందూ దేవాలయాల్ని నిర్లక్ష్యం చేశారన్నారు. కాసుల కక్కుర్తితో తిరుపతి వెంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని సైతం కల్తీ చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవాలయాల అభివృద్దికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించామని తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామన్నారు. గత ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశారన్నారు. నాడు జగన్ వెలిగొండ పూర్తిగా కాకుండానే జాతికి అంకితం చేసి జిల్లా ప్రజలను మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వెలిగొండ పనులు యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు. త్వరలో వెలిగొండ నుంచి నీళ్లు అందించి ఈ ప్రాంతాన్ని అంతా సస్యశ్యామలం చేస్తామని మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు.