google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ప్రతి రోజూ ఒక్కరికైనా ఆహారాన్ని అందించాలి అనే ఉద్దేశంతో,చేయి చేయి కలుపుదాం పేదవారి అవసరాలను తీర్చుదాం అనే నినాదంతో.శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు వారి ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, నెలవారీ దాతలు సహాకారంతో కందుకూరు పట్టణ వీధుల్లోని పేదలకు,అంకమ్మ తల్లి దేవస్థానం దగ్గర ఉన్న యాచకులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు అధ్యక్షులు సేవా హృదయ రవ్వా శ్రీనివాసులు (ఎల్ ఐ సి & స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్),ఈ.సి.మెంబర్ కోట వెంకటేశ్వర్లు, సభ్యులు చీదెళ్ల లక్ష్మీ నరసింహా తారక్ గార్లు పాల్గొన్నారు.