google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :-
కోవూరు నియోజవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తూ శుక్రవారం కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన విలేజ్ హెల్త్ సెంటర్ను ప్రారంభించాను.చిన్నచిన్న ఆరోగ్య సమస్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు లేకుండా, నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు గ్రామంలోనే అందాలనే లక్ష్యంతో ఈ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేశాం.ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు మా కృషి నిరంతరం కొనసాగుతుంది.