google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

"సంచార జాతుల పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం వారిని విధిగా బడులకు పంపించాలి" - జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు.
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సంచార జాతుల అవగాహన సదస్సు & ముఖాముఖి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంచార జాతుల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. ప్రధానాంశాలు:
విద్యావకాశాలు: సంచార జాతుల పిల్లలను ఏ బడిలోనైనా చేర్పించేందుకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందజేస్తాం. గుర్తింపు కార్డుల జారీ: ప్రతి కుటుంబానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, హెల్త్ కార్డు మరియు కుల ధ్రువీకరణ పత్రాలు విధిగా అందేలా తగిన చర్యలు. నివాస వసతి: P4 విధానం ద్వారా మరియు ఎన్జీవోల (NGOs) సహకారంతో అర్హులైన వారందరికీ ఇంటి వసతి కల్పనకు ప్రణాళికలు. ప్రత్యేక కమిటీ: సంచార జాతుల సమస్యల సాధన, జీవనోపాధి మెరుగుదలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి సంక్షేమ చర్యలు."సంచార జాతులకు పురాణ కాలం నుండి గొప్ప చరిత్ర ఉంది. మీరెవరూ అధైర్యపడకుండా, ఆత్మవిశ్వాసంతో సమాజంలో తల ఎత్తుకుని తిరగాలి. మీ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుంటుంది." — శ్రీ పి. రాజాబాబు, జిల్లా కలెక్టర్.
ఈ సదస్సులో బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీ వెంకటేశ్వరరావు, బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీమతి నిర్మల జ్యోతి మరియు సంచార జాతుల సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొని తమ సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు.