
ప్రముఖ పుణ్యక్షేత్రం మాలకొండపై వెలసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామిని…..
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు ఈరోజు దర్శించుకున్నారు. అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా మాలకొండపై అందుతున్న సౌకర్యాల గురించి ఎమ్మెల్యే గారు భక్తులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా భక్తులందరికీ అన్నదానం అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో శ్రీనివాసరెడ్డికి సూచించారు.
మండల టిడిపి అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, లింగసముద్రం మండల టిడిపి అధ్యక్షులు పూరిమిట్ల గురునాథం, పార్టీ నేతలు కాకుమాని హర్ష, పెగడ మోహన్, కామినేని అశోక్, పరిటాల శివ తదితరులు ఉన్నారు.