
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన PTM కార్యక్రమంలో భాగంగా పొందూరులో కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాతం శ్రీనివాసరావు గారి అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొని గడిచిన విద్యా సంవత్సరములో 10 వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి IIIT లో ఇద్దరు విద్యార్థులకు సీట్లు రావటం మంచి పరిణామమని ఇందుకు విశేష కృషి చేసిన హెడ్ మాస్టర్ యాతం శ్రీనివాసరావు గారిని,ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ విద్యా కమిటీ చైర్మన్ జయరామయ్య గారు, విద్యా కమిటీ చైర్మన్ కొల్లూరి సుధాకర్ గారు,పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.