
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి టీడీపీ కార్యాలయం వద్ద 334 అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్లు, అధునాతన వంట పరికరాలను దర్శి టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు అందజేశారు.అంగన్వాడీలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ, పనిభారం తగ్గిస్తున్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారికి అంగన్వాడీ కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో CDPO పరిమళ గారు, టీడీపీ నాయకులు, అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.