
తొలి శుభోదయం న్యూస్ కొండపి:-
పాము కాటుకు గురై కొండపి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంబేద్కర్ గురుకులం విద్యార్థిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పరామర్శించారు. కొండపి డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల తొమ్మిదో తరగతి విద్యార్థి మోక్షిత ఆదివారం పాఠశాలలో పాముకాటుకు గురైంది. వెంటనే పాఠశాల సిబ్బంది విద్యార్థిని కొండపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి విద్యార్థిని పరామర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్లను అడిగి మంత్రి విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. విద్యార్థిని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆదేశించారు.