
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
కంభం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో కంభం పట్టణంలోని ఇనుప స్క్రాప్ కొనుగోలుదారులు, స్క్రాప్ వ్యాపారులు మరియు స్క్రాప్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా దుకాణాల్లో ఉన్న స్క్రాప్ సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించగా ఎలాంటి అనుమానాస్పద లేదా చోరీ సొత్తు గుర్తించబడలేదు.అనంతరం దుకాణ యజమానులకు చోరీకి గురైన ఇనుము, రాగి (కాపర్), వ్యవసాయ మోటార్లు, విద్యుత్ వైర్లు, ప్రభుత్వ లేదా ప్రజా ఉపయోగానికి సంబంధించిన సామగ్రి వంటి అనుమానాస్పద వస్తువులను కొనుగోలు చేయరాదని సూచించారు. అలాగే స్క్రాప్ కొనుగోలు చేసే ప్రతి లావాదేవీకి సంబంధించి విక్రేత పూర్తి వివరాలు, కొనుగోలు చేసిన వస్తువుల వివరాలతో కూడిన కొనుగోలు రిజిస్టర్ను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు.స్క్రాప్ వ్యాపారులు చట్టాలను పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని, అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.