
తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:-
భీమవరంలో నిర్వహించిన "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గ్రామంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పాటు పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా ముందుకు సాగుతున్నారు. నాయకులు ప్రతి ఇంటికీ వెళ్తూ ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా జాజుల రవి పేర్కొన్నారు. స్థానిక నివాసితులు నాయకులకు ఘనస్వాగతం పలికి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో భీమవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాజుల రవి, యూనిట్ ఇంచార్జి జి.వి. చలపతి రావు, గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు మల్లవరపు కోటిరెడ్డి, చింతం లీలా కృష్ణ రెడ్డి, మరియు మరో సీనియర్ నేత కాకర్లపూడి వెంకటరమరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.