
మద్యం మరియు చెడు వ్యసనాలకు అలవాటు పడి, దొంగతనాలు చేస్తున్న నేరస్తులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
మద్దిపాడు మండలం, మద్దిపాడు గ్రామంలో పైపాలెం నందు తాళం వేసి ఉన్న ఇంటి తలుపులు, పగలు పూట సమయంలో పగలగొట్టి, బంగారు ఆభరణాలు దొంగిలించిన నేరస్తులు వద్ద నుండి సుమారు Rs 18,00,000/- రూపాయలు విలువ గలిగిన 157.5 గ్రాముల బంగారు ఆభరణాలు Rs 51,000/- నగదును మరియు దొంగతనానికి ఉపయోగించిన ఇన్నోవా కారును రికవరీ చేయడం జరిగినది.
ముద్దాయి పేర్లు.
A 1.గోపిశెట్టి సునీల్ S/o నాగేంద్ర రావు (Late ), వయసు 48 సం , రాలు , రామకృష్ణ నగర్ , కొండాయపాలెం గేట్ , నెల్లూరు టౌన్ -4, నెల్లూరు జిల్లా.
A2.తమ్మి శెట్టి ఆనంద్ S/o శ్రీను, వయసు 19 సం, మాదాల గ్రామం , ముప్పాళ మండలం , పల్నాడు జిల్లా.
A3. తమ్మి శెట్టి వెంకటేశ్వర్లు S/o (Late ) లక్ష్మీ నారాయణ, వయసు 25 సం, మాదాల గ్రామం , ముప్పాళ మండలం , పల్నాడు జిల్లా.
A4. మలమంతి సాయి కుమార్ S/o వెంకటేశ్వరావు ,వయసు 33 సం , రాలు, N/o ఓబులాపురం గ్రామం , రెడ్డి గూడెం మండలం , NTR జిల్లా Now at డౌన్ సెంటర్ , మైలవరం గ్రామం & మండలం , NTR జిల్లా
Cr. No. 87/2026 U/s 331(4),307 BNS of Maddipadu PS.
నేరం జరిగిన విధానము- A1 ముద్దాయి గోపిశెట్టి సునీల్ A3 తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు ఇద్దరికీ గతంలో జైల్లో పరిచయం అయినందున, జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత చెడు వ్యసనాలకు బానిస అయ్యి, దొంగతనాలు చేయాలనే ఉద్దేశంతో ఈనెల 16 తేదీన ఇనోవా కారుని అద్దెకు తీసుకొని తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, అతని సోదరుడైన తమ్మిశెట్టి ఆనంద్ కారు డ్రైవర్ గా తన స్నేహితుడైన సాయిని తీసుకుని కారులో చీరాల బీచ్ కి వచ్చి అక్కడ సరదాగా గడిపి తరువాత జైల్లో పరిచయమైన గోపిశెట్టి సునీల్, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు కు ఫోన్ చేయగా సునీల్ ని బాపట్ల రమ్మని చెప్పినాడు. తరువాత తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, ఆనంద్ కారు డ్రైవర్ అయిన సాయి ముగ్గురు కలిసి బాపట్ల వచ్చి, సునీల్ ని కారులో ఎక్కించుకొని ఏదైనా నేరం చేయాలనే ఉద్దేశంతో పొన్నూరు, చీరాల,బాపట్ల తదితర ప్రాంతాలలో తిరిగి తరువాత ది. 23.07.2026 వ తేదీన చీరాల నుండి బయలుదేరి ఒంగోలులో గాని, చుట్టుపక్కల ప్రాంతాలలో గాని, నేరం చేయాలని అనుకొని వచ్చే క్రమంలో మద్దిపాడు గ్రామంలోకి మధ్యాహ్నం 12.00 గంటల సమయానికి వచ్చి తాళం వేసి ఉన్న ఇళ్లను పరిశీలించుకునే క్రమంలో ఫిర్యాదు అయిన మీసాల వెంకట వంశీకృష్ణ అనే అతను ఇంటికి తాళం వేసి, ఇంట్లో వారు సొంత పనులు నిమిత్తము ఒంగోలు వెళ్లి వచ్చిన క్రమంలో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న సుమారు 26 సవర్లు బంగారపు ఆభరణాలను దొంగిలించడం జరిగినది. ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పి ఆర్ శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో ఒంగోలు రూరల్ సీఐ శేషగిరిరావు మరియు మద్దిపాడు ఎస్ఐ వెంకట సూర్య వారి సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసు తీరును బట్టి దర్యాప్తును ప్రారంభించి సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉపయోగించి నేరస్థులు ఉపయోగించిన వాహనం ను గుర్తించి, వారి వద్ద నుండి బంగారం మరియు నగదు కారును స్వాధీనం చేసుకొని వారిని మద్దిపాడు మండలంలోని గుండ్లపల్లి గ్రామం వద్ద అరెస్టు చేయటం జరిగినది.స్వాధీన పరుచుకున్న సొత్తు వివరాలు:-
1.బంగారపు లక్ష్మీదేవి కాసులు హారం -01 2. బంగారపు మామిడి పిందెల నెక్లెస్ -01 3. బంగారపు ఎర్ర రాళ్ళ నక్లెస్ - 01 4. బంగారపు సాదా రింగుల నెక్లెస్ -01 5. బంగారపు పూసల దండ -01 6. బంగారపు ఉంగరాలు -01 07. బంగారపు బ్రాస్లెట్స్ -01 8. బంగారపు లక్ష్మీదేవి డాలర్ , మరియు రూపు -02 9. బంగారపు చెంప చవరలు -01 జత 10. బంగారపు పాపడబిళ్ళ -01 11. హారాలు మీద వేసుకునే బంగారపు కమ్మలు -05 జతలు 12. వెండి బిల్లలు -03 212 గ్రాములు బరువు గలిగిన బంగారపు నగలు విలువ Rs 18,00,000/- రూపాయలు విలువ గల వాటిని స్వాధీనం చేసుకొనడం అయినది. మరియు పైవారు దొంగతనానికి ఉపయోగించిన AP 27 TX 7738 Innova కంపెనీకి చెందిన సాండ్ సిల్వర్ కారు ను స్వాధీనం చేసుకొనడం అయినది. ఈ కేసులో ఇంకా మిగిలిన దొంగలించబడిన సొత్తు ఒక గోల్డ్ చైన్, ఒక గోల్డ్ రింగ్ మరియు ఒక గోల్డ్ కడియం IDFC బ్యాంక్, నరసరావుపేట బ్రాంచ్ నుండి స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నది.
పై కేసును త్వరగా సేదించడంలో మరియు ముద్దాయిలను చాకచక్యంగా అరెస్టు చేయడంలో, దొంగిలించిన పైసొత్తును రికవరీ చేయడంలో, ప్రతిభ చూపిన ఒంగోలు SDPO రాయపాటి శ్రీనివాసరావు గారు, ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ M. శేషగిరిరావు, మద్దిపాడు ఎస్ఐ గారు G. వెంకట సూర్య మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు అభినందించారు.