
తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
దర్శి నియోజకవర్గం, దర్శి పట్టణ పరిధిలోని సందువారిపాలెం గ్రామంలో రూ.49 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన హిందూ స్మశాన వాటికను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ రాజాబాబు గారు, దర్శి నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, దర్శి మున్సిపల్ చైర్మన్ శ్రీ నారపుశెట్టి పిచ్చయ్య గారు, దర్శి ఏఎంసీ చైర్మన్ శ్రీ దారం నాగమణి సుబ్బారావు గారు, దర్శి మున్సిపల్ కమిషనర్ శ్రీ కె. అర్జున్ రావు గారు పాల్గొన్నారు.అనంతరం స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి స్మశాన వాటికలో కల్పించిన సదుపాయాలను పరిశీలించారు.ప్రజల అవసరాలకు ప్రాధాన్యం…
మౌలిక వసతుల కల్పనకు నిరంతర కృషి…
అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న దర్శి!