
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ఈనెల 6 తేదీన కందుకూరులో చుండూరు మృతవీరుల 35వ స్మారక సదస్సు నిర్వహిస్తున్నామని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేందర్రావు తెలిపారు. ఆదివారం సాయంత్రం కందుకూరులో జరిగిన సమావేశంలో నీలం నాగేందర్రావు మాట్లాడుతూ 1991 ఆగస్టు 6న చుండూరులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాలపల్లిను చుట్టుముట్టి పోలీస్ బలగాల సహాయంతో కాంగ్రెస్ పార్టీ రెడ్లు మాలలను ఊచకోత కోశారన్నారు.చుండూరు నరమేధం లో పదిమంది మాలలు కాంగ్రెస్ రెడ్ల కుల అహంకారానికి కండకావురానికి బలయ్యరన్నారు. మాలల రక్తంతో చుండూరులోని తుంగభద్ర నది రక్తదారగా మారిందన్నారు. చుండూరు మృతవీరుల త్యాగ ఫలితమే భారతదేశం దళితులు అనుభవిస్తున్న ఎస్సీ ఎస్టీ యాక్ట్ అన్నారు.భారతదేశ దళితుల దిశా,,దశ తలరాతలను మార్చిన పోరు పతాకమై నిలిచిన చుండూరు మృతవీరులకు స్మరించుకోవలసిన బాధ్యత దళిత జాతి పై ఉందన్నారు.చుండూరు మారణకాండ భారత దేశ దళిత ఉద్యమాలలో వేగుచుక్క అన్నారు.దళితున్ని రాష్ట్రపతి చేసింది చుండూరు ఉద్యమమే అన్నారు
. హైకోర్టులో చుండూరు అగ్రకుల రెడ్డి అంతకులందరూ నిర్దోషిలేనని ప్రకటించి,న్యాయవ్యవస్థ ఇచ్చిన మనువాద తీర్పును దేశవ్యాప్తంగా దళితులు వ్యతిరేకించి ఉద్యమాలు చేశారన్నారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో చుండూరు కేసు మనువాద కమల న్యాయాధిపతుల విచారణ కు 35 ఏళ్లు అయినా రాలేదన్నారు.చుండూరు మృతవీరులకు న్యాయం కోసం ఈ నెల 6 తేదీన కందుకూరు సిపిఐ పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు జరుగునున్న చుండూరు నరమేధ సదస్సును జయప్రదం చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేందర్రావు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమ కారులు పాలేటి కోటేశ్వరరావు,, మాల మహానాడు నాయకులు బొమ్మల ధర్మయ్య,,కంటనపల్లి సూర్యనారాయణ,,బోట్లగుంట శ్రీనివాసులు,, లింగా బత్తిన లక్ష్మణ్ మాజీ కౌన్సిలర్ వేనమాల అయ్యన్న తదితరులున్నారు.