
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గ :-
అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎంఆర్ఎఫ్ (CMRF) ద్వారా పెద్ద దిక్కుగా నిలిచి ఆర్థిక ఆసరా అందిస్తున్నారు. మంగళవారం నెల్లూరులోని వి.పి.ఆర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశాను. కోవూరు నియోజకవర్గానికి చెందిన 49 మంది లబ్ధిదారులకు రూ. 42.17 లక్షల విలువైన CMRF చెక్కులను మరియు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి తరఫున రూ. 8.16 లక్షల ఆర్థిక సాయాన్ని బాధితులకు అందజేశాను.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల వ్యవధిలో కోవూరు నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని 27 సార్లు నిర్వహించాము, ఇప్పటివరకు దాదాపు రూ. 10.50 కోట్ల మేర పేదలకు వైద్య సహాయం అందించాము.పేద ప్రజలను ఆదుకుంటున్నందుకు ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.