
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని 6వ వార్డులో రెండేళ్ల నమ్మకం అభివృద్ధి,సంక్షేమం ఇంటింటికీ తెలుగుదేశం ప్రచార కార్యక్రమం (డోర్ టు డోర్) నిర్వహించడం జరిగింది…కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా 6వ వార్డులోనీ కోటకట్ట వీధిలోని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి.అలాగే ఈ రెండు సంవత్సరాలలో కందుకూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని తెలియపరుస్తూ కరపత్రాల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ సలీం,నియోజకవర్గ ఐ-టిడిపి అధ్యక్షులు షేక్ మున్న,పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ అహ్మద్ బాషా,141 BLA షేక్ ఫిరోజ్,6వ వార్డు ప్రధాన కార్యదర్శి జంగాల మాల్యాద్రి,బొమ్మినేని రాజు పాల్గొనడం జరిగింది.