
తొలి శుభోదయం న్యూస్ మంగళగిరి:-
మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా దర్బార్ - గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ మరియు రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితులు, ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. బాధితుల సమస్యలను సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది.ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేయడం జరిగింది.