
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, పెండింగ్లో ఉన్న యూ.ఐ. (U.I.) కేసుల తుది పరిష్కారం, చార్జ్షీట్ల తయారీ, కోర్టుల నుంచి రిటర్న్ అయిన చార్జ్షీట్లలో లోపాల సవరణ మరియు పునఃసమర్పణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు మార్కాపురం జిల్లా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఈ సందర్భంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసులను సకాలంలో పూర్తి చేసి నాణ్యమైన చార్జ్షీట్లు సిద్ధం చేయాలని, కోర్టులు సూచించిన లోపాలను వెంటనే సరిదిద్ది చార్జ్షీట్లను పునఃసమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తు నాణ్యతను మెరుగుపరుస్తూ, బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.