
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరిని గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ హైదరాబాదులో వారి నివాసమందు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి శ్రీకాంత్ దంపతులను ఆప్యాయంగా పలకరించి క్షేమ సమాచారాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారిని కలవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.