
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
సామాజిక విప్లవ పాటల తూటా లాల్,నీల్ ఉద్యమ వారధి ప్రజా యుద్ధనౌక గద్దర్ అని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు నివాళులర్పించారు. కందుకూరులో సిపిఐ కార్యాలయంలో సామాజిక విప్లవ జన చేతన పోరు పతాకం గద్దర్ మూడవ స్మారక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి సామాజిక ఉద్యమకారులు పాలేటి కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ అంటరాని కులంలో పుట్టిన గుమ్మడి విటల్ రావు సాయుధ పోరాట పంథా ఎంచుకొని విప్లవ పార్టీని భారత దేశంలో విస్తరించాడన్నారు. గద్దర్ కేవలం తెలుగు నాటే కాక తన హిందీ విప్లవ గీతాలతో భారతదేశంలో కూడా అప్పటి పీపుల్స్ వార్ కు క్యాడర్ పెరిగేలా సాయిధం చేశాడన్నారు అగ్రకుల రాజకీయ పార్టీల పోలీస్ హింసను తన పాటల ద్వారా ఎండగట్టారన్నారు. దళితులు ఆదివాసీలు మహిళలపై మేధావులపై జరుగుతున్న రాజకీయ పోలీస్ అక్రమ నిర్బంధాలను మన చేతలపై గల మెత్తడన్నారు ఆనాడు దేశంలో జరిగిన బూటపు ఎన్కౌంటర్ల లో చనిపోయిన నక్సలైట్ శవాల స్వాధీన కమిటీకి నాయకత్వం వహించి నక్సలైట్ శవాలను వాళ్ళ కుటుంబాలకు అందించాడన్నారు పౌరహకుల సంఘాలు, మానవ కుల వేదిక, విరసం లాంటి అనేక విప్లవ కార్ఖానాలకు కాపలాగా తన పాటలతో పీడితల పక్షాన నిలిచాడన్నారు. అగ్రకుల రాజ్యాల నిర్బంధాన్ని నిషేధాలను తట్టుకొని తన గజ్జల సవ్వడితో అగ్రకుల రాజకీయ పార్టీలలో అలజడి సృష్టించిన గద్దర్ సాయుధ పోరాట జన చేతన పోరు బావుట అని నీలం నాగేంద్రరావు అన్నారు.1985 లో కారంచేడు మాదిగలపై ఆనాటి తెలుగుదేశం ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వియ్యంకుడైన దగ్గుబాటి చెంచురామయ్య నాయకత్వంలో జరిగిన మారణ కాండప్ గద్దర్ తన పాటల ద్వారా గర్జించారన్నారు. దళిత పులులమ్మ కారంచేడు భూస్వాములతో అంటూ గద్దర్ కారంచేడు మారణకాండ పై ఆలపించిన పాట దళిత జాతి విముక్తి గేయంగా మారింది అన్నాడు. వర్గ పోరాటాలే భారతదేశ విముక్తికి మార్గమని నమ్మిన విప్లవ పార్టీలను భారతదేశంలో కులాన్ని గుర్తించి కుల అస్తిత్వ ఉద్యమాలకు మద్దతు పలకాలని పీపుల్స్ వార్ అగ్రనాయకత్వాన్ని ఒప్పించిన సామాజిక న్యాయ విప్లవ కెరీట దారి గద్దర్ మాత్రమేనన్నారు. విప్లవ పార్టీ విస్తరించడానికి గద్దర్ ప్రధాన కారకుడని భావించిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గద్దర్ను తన పోలీసులతో కాల్పులు జరిపించి హత్యా ప్రయత్నం చేశాడు అన్నారు. ఆనాడు చంద్రబాబు నుంచి తప్పించుకొని బయటపడిన అనారోగ్యంతో వివిధ ప్రజల యుద్ధనౌక గద్దర్ 2023 ఆగస్టు 6 వ తేదీన అనారోగ్యంతో మరణించాడు అన్నారు. గద్దర్ తెలంగాణలో జన్మించిన విప్లవ పార్టీ జన చైతన్య సారధిగా ఉన్న తాను అంటరాని మల్లె మొగ్గనని చెప్పుకున్నాడన్నారు గద్దర్ కు 1985 కారంచేడు మారణకాండ నుండి సముద్రం, చీమకుర్తి, సారా ఉద్యమం కొయ్యూరు బూటకపు ఎన్కౌంటర్ మరియు కలేకూరి ప్రసాద్ సాహిత్య సభలో నిర్వహణకు కూడా వచ్చారన్నారు. గద్దర్ సామాజిక విప్లవ జన చేతన పాటల తూటాగా చరిత్రలో దళిత చైతన్య జ్వాలగా సామాజిక పోరు పతాకంగా మిగిలిపోయాడన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య మాదిగ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు పట్రా బంగారం, మాదిగ భూ పోరాట సమితి నాయకులు రేనమాల అయ్యన్న తదితరులు ఉన్నారు.