
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా పెదరికట్ల గ్రామ శివార్లలో బహిరంగంగా మద్యం సేవించడం మరియు జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు కేకేమిట్ల పోలీసులు డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు.డ్రోన్ కెమెరాల ద్వారా అనుమానాస్పద ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గ్రామ శివార్లలో బహిరంగ మద్యం సేవించడం, జూదం వంటి కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.