
త్రివర్ణ పతాకాలతో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలో దేశభక్తి వెల్లివిరిసింది. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా… హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని గురువారం ఉదయం నిర్వహించగా, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పలు రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమైక్యవాదాన్ని చాటిచెప్పారు. ఎల్ఐసి కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన సైకిల్ ర్యాలీలో గౌరవ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ, మున్సిపల్ కమిషనర్ కే.అనూష , సిఐ అన్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చివరగా అందరి చేత దేశభక్తి ప్రతిజ్ఞ చేయించారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ… 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఇంటింటా ఘనంగా జరుపుకోవాలని కోరారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాలు ఎగురవేయాలన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి త్యాగాలను గుర్తు చేసుకోవటంతో పాటు వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అంతకుముందు పలు పాఠశాలల విద్యార్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, మెప్మా సిబ్బంది, పొదుపు గ్రూపు మహిళలు, ఇంకా పలురా అనేక రంగాలకు చెందినవారు జాతీయ జెండాలు చేతబట్టి, నినాదాలు చేసుకుంటూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పార్టీ నాయకులు ఉన్నం వీరాస్వామి, పిడికిటి వెంకటేశ్వర్లు, కండ్రా మాల్యాద్రి, ఉప్పుటూరి శ్రీనివాసరావు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్, షేక్ రఫీ, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ సలాం, బిజెపి నాయకులు వరప్రసాదరావు, రాయపాటి శ్రీనివాసరావు, చనమాల శ్రీధర్, అన్న క్యాంటీన్ చైర్మన్ కొండలరావు, ఏఎంసి డైరెక్టర్ మాదాల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.