
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, (స్వయంప్రతిపత్తి )కందుకూరు నందు ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజినల్ బ్రాంచ్ ఆఫీస్ కందుకూరు వారి సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. 80 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా స్టేట్ బ్యాంక్ వారు విద్యాసంస్థలకు మొక్కలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐదు వందల మొక్కలు అందించడం జరిగింది. అందులో భాగంగా కళాశాలలో ఏర్పాటుచేసిన మీయావాకి వనం నందు ఈరోజు స్టేట్ బ్యాంక్ రీజినల్ బ్రాంచ్ ఆఫీస్, రీజనల్ మేనేజర్, వీ. అప్పల రాజు, స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్, శ్రీనివాస్ కళ్యాణ్ మరియు మేనేజర్, నాగేంద్ర , కళాశాల ఆవరణలో మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ సహిత కార్యక్రమాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్లప్పుడు తమ సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ గారు తెలియజేశారు. తమ కళాశాలకు, మొక్కలు అందించిన స్టేట్ బ్యాంక్ వారికి కళాశాల ప్రిన్సిపాల్ ధన్యవాదాలు తెలియజేశారు. తమ కళాశాల పర్యావరణ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ఆ కార్యక్రమాలకు అందరూ తమ సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల వృక్ష శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ ఎం తిరుపతి స్వామి, డాక్టర్ రాజశేఖర్, అధ్యాపకులు డాక్టర్ పి రాజగోపాల్, డాక్టర్ ఎన్వి శ్రీహరి, డాక్టర్ కె.వి పద్మావతి, శ్రీ బి కమల బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మీయావాకి వనాన్ని కళాశాలలో ఏర్పాటు చేయడానికి సహకరించిన స్కందపురి సేవా సమితి చైర్మన్ శ్రీమతి పువ్వాడ మౌనిక పాల్గొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి మరియు రీజినల్ మేనేజర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.