
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విద్యార్థినీ విద్యార్థులు మరియు అధ్యాపకులు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవికుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు అందరూ మంచిగా చదువుకోవడం తోపాటు దేశభక్తితో మెలగాలని, దేశ అభ్యున్నతికి పాటుపడాలని తెలియజేశారు. దేశ పురోభివృద్ధిలో యువత యొక్క పాత్ర ఎంతో కీలకమైనదని ఆయన విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు.స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను, ప్రతి విద్యార్థి దేశం పట్ల తమ బాధ్యతను గుర్తించి ఏ విధంగా మెలగాలో వివరించారు. ఫిజికల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రసాయన శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ కె వి పద్మావతి, పిడి శ్రీ కరుణ రత్నకుమార్, అధ్యాపకులు, డాక్టర్ ఎన్వి. శ్రీహరి, శ్రీ కే. శ్రీనివాసులు,డాక్టర్ పి. రాజగోపాల్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ఎన్., తిరుపతి స్వామి, డాక్టర్ పుష్పమ్మ , శ్రీ బి. కమల బాబు, శ్రీ కె. నరేష్ రాజా, డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ మల్లికార్జున, మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.