
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
పెద్దారవీడు మండలంలోని కలనూతల, సుంకేసుల, గుండంచర్ల మరియు మార్కాపురం మండలంలోని గొట్టిపడియా ముంపు గ్రామాలకు చెందిన రేషన్ కార్డుదారులకు 01.09.2026 నుండి ప్రత్యేక పంపిణీ కేంద్రాల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్, మార్కాపురం జిల్లా వారు తెలిపారు.ముంపు గ్రామాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా, వారి సౌకర్యార్థం క్రింద పేర్కొన్న ప్రదేశాలలో రేషన్ బియ్యం పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాలకు చెందిన ప్రతి రేషన్ కార్డుదారు తమకు కేటాయించిన పంపిణీ కేంద్రానికి వచ్చి తమ రేషన్ కార్డుపై లభించే బియ్యం మరియు ఇతర రేషన్ సరుకులను పొందవచ్చును.
రేషన్ పంపిణీ కేంద్రాల వివరాలు
క్ర.సం.| ముంపు గ్రామం| రేషన్ పంపిణీ కేంద్రం| డీలర్ పేరు| ఫోన్ నంబర్
1| కలనూతల| దేవరాజుగట్టు| వెంకటేశ్వరెడ్డి|
2| గుండంచర్ల| దేవరాజుగట్టు| రాజేశ్వర రెడ్డి|
3| గొట్టిపడియా| ఇందిరమ్మ కాలనీ| గురవయ్య
4| సుంకేసుల| గోగులదిన్నె కమ్యూనిటీ హాల్| రోశయ్య|
ముంపు గ్రామాలకు చెందిన అర్హత కలిగిన ప్రతి రేషన్ కార్డుదారు తప్పనిసరిగా తమకు కేటాయించిన పంపిణీ కేంద్రానికి వెళ్లి రేషన్ సరుకులను పొందాలని అధికారులు సూచించారు.రేషన్ సరుకుల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, పారదర్శకంగా మరియు సక్రమంగా పంపిణీ జరిగేలా సంబంధిత అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ చేపట్టనున్నారు. రేషన్ కార్డుదారులు సంబంధిత డీలర్ల ఫోన్ నంబర్లకు సంప్రదించి పంపిణీకి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చును…..