
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు.ప్రజలు అందించిన అర్జీలను పరిశీలించి, సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం… ప్రజల సంక్షేమమే ధ్యేయం!