
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్: జేడీబీఎం టౌన్ బాప్టిస్ట్ చర్చి వద్దతో పాటు వివిధ ప్రాంతాల్లో చిన్నారులు, పేదలు, యాచకులకు భోజన ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను అందజేశారు. ఈ సేవను ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా సేవా సమితి కార్యదర్శి శీలం వెంకటేష్ మాట్లాడుతూ, ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహిస్తున్న ఈ సేవను నిరంతరం కొనసాగిస్తూ, మరింత మందికి తమ వంతు సహాయం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జంగాల విశ్వసంభవ్ చేతుల మీదుగా భోజన ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. దాతలు, శ్రేయోభిలాషులు అందిస్తున్న సహకారంతో మరింత మందికి సేవ అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రేమ్ బాబు, నితీష్, ఉదయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.