
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు,వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు,ప్రజానేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అనుచిత వాక్యాలపై మంగళవారం సింగరాయకొండ మండల వైస్సార్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించి ఇంకోసారి ఇలాంటి అనుచిత మాటలు మాట్లాడితే వైస్సార్సీపీ పార్టీ తరుపున తగిన బుద్ది తెలియచేయటం జరుగుతుంది అని హెచ్చరించటం జరిగింది.ఈ ప్రెస్ మీట్లో వైస్సార్సీపీ సింగరాయకొండ గ్రామ అధ్యక్షులు షైక్ కరీం,శానంపూడి గ్రామ అధ్యక్షులు శంకర్,తన్నీరు రామకృష్ణ,నౌషద్, అభిద్,జావీద్,జిలాని,ఇంతియాజ్,కరీముల్లా,వెంకరెడ్డి,సురేష్ తదితరులు పాల్గొన్నారు.