
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
మూలగుంటపాడు వైఎస్సార్సీపీ నాయకుడు నారాయణరెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ PAC సభ్యుడు, కొండేపి నియోజకవర్గ ఇన్చార్జి డా. ఆదిమూలపు సురేష్ సంతాపం వ్యక్తం చేశారు.నారాయణరెడ్డి మరణవార్త తెలుసుకున్న ఆయన బుధవారం మూలగుంటపాడులోని వారి స్వగృహానికి చేరుకుని, భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.