
తొలి శుభోదయం న్యూస్ కంభం:-
విద్యార్థుల్లో నైతిక విలువలు, మానవతా దృక్పథం, మంచి ప్రవర్తనను పెంపొందించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ‘విలువల విద్య’ పుస్తకాలను మంగళవారం మండలంలోని అన్ని పాఠశాలలకు పంపిణీ చేశారు.
విద్యార్థులకు చిన్ననాటి నుంచే నిజాయితీ, క్రమశిక్షణ, దయ, సేవాభావం, బాధ్యత, సహనం, సత్ప్రవర్తనా విలువలను అలవర్చే విధంగా పుస్తకంలోని పాఠ్యాంశాలను రూపొందించారనీ,పాఠశాలలకు పుస్తకాలు చేరిన అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు పంపిణీ చేసి, తరగతి బోధనలో భాగంగా వినియోగించనున్నట్లు విద్యాశాఖ అధికారులు చెప్పారు.