
తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం:-
తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో కొండపి నియోజకవర్గంలోని ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, డిప్యూటీ ఎంపీడీవోలతో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు.