
టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్తో గ్రామ పరిసరాల్లో విస్తృత నిఘా – ప్రజల భద్రతకు ప్రత్యేక చర్యలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
అర్ధవీడు పోలీసుల ఆధ్వర్యంలో కలనూతల గ్రామం మరియు పరిసర ప్రాంతాల్లో డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాలు మరియు ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలను డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు.గ్రామ పరిసరాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పద కదలికలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకునేలా పోలీసులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.టెక్నాలజీని వినియోగిస్తూ నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడం లక్ష్యంగా అర్ధవీడు పోలీసులు డ్రోన్ నిఘాను చేపట్టారు.