
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
వినాయకచవితి పండుగను పురస్కరించుకొని సింగరాయకొండ లో నిర్వహించిన పలు శ్రీ గణేష్ మండపాల వద్ద పూజ కార్యక్రమంలో పాల్గొని, స్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ *శ్రీ దామచర్ల సత్య. రైల్వే రోడ్డులో భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ మండపాన్ని సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.జి.వి.ఆర్. రోడ్డులోని గణేష్ మండపం వద్ద జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలు అందుకోవడం జరిగింది. పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన ప్రసిద్ధ మండపాన్ని సందర్శించి, గణనాథునికి ప్రత్యేక హారతులుర్పించి దర్శనం చేసుకోవడం జరిగింది.