
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కందుకూరులో నిర్వహించిన ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొని దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించాను.ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మోదీ గారి దార్శనిక నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై తన ప్రత్యేకతను చాటుకుంటూ, అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. రాష్ట్ర అభివృద్ధికి, కూటమి ప్రభుత్వానికి కేంద్రం అందిస్తున్న సహకారం అభినందనీయం.
మోదీ గారికి ఆయురారోగ్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటున్నాను.