google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
రోడ్డు భద్రతను మెరుగుపరచడం మరియు ట్రాఫిక్ను సక్రమంగా నిర్వహించడం కోసం పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు రద్దీ ప్రాంతాల్లో బ్యారికేడ్లు, కోన్స్ ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని ఒంగోలు డీఎస్పీ మరియు ట్రాఫిక్ సీఐ గారి పర్యవేక్షణలో నిర్వహిస్తూ, వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించేలా అప్రమత్తంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదాలకు కారణమయ్యే నిర్లక్ష్య డ్రైవింగ్ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
రహదారులపై సురక్షిత ప్రయాణం కల్పించేందుకు పోలీసులు నిరంతరం విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించి, పోలీసులకు సహకరించాలని కోరారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని సూచించారు.