google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
కొండేపి నియోజకవర్గం,
దేశప్రజల ఆరాధ్య దైవం, జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం మెరుపడాలని, పవన్ కళ్యాణ్ గారు మరల ప్రజలకు మరింత చేరువై ప్రజా సేవలో మునుపటి కన్నా చురుగ్గా పాల్గొనాలని కొరుకుతుంటూ మంగళవారం సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ గారి ఆధ్వర్యంలో అభయఆంజనేయస్వామి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది. ప్రజలే దేవుళ్ళు అని నిరంతరం ప్రజల కోసం పరితపిస్తూ రాష్ట్ర భవిష్యత్తు కోసం తను తగ్గి రాష్ట్ర అభివృద్ధి నీ పరుగులు పెటించే దశలో అహర్నిశలు కష్టపడుతూన్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారికి స్వల్ప సర్జరీ చేయటం, డాక్టర్లు కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోని మని చెప్పటం జరిగినది. భగవంతుని ఆశీసులతో దేశ ప్రజల దీవెనలతో త్వరగా కోలుకోవాలని మనస్పర్తిగా ఆ భగవంతుని ప్రాదిస్తున్నాము. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్, మండల కార్యదర్శి అనుమలశెట్టి కిరణ్ బాబు, గుంటుపల్లి శ్రీనివాసరావు, రాజు, సుల్తాన్, సుబ్రమణ్యం, పి వెంకటేశ్వర్లు, షేక్ నాగుర్ వలి, నరేష్ మరియు వీర మహిళలు, జన సైనికులు మరియు తదితరులు పాల్గొనడం జరిగినది.