
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
SSC 2026 ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన గిద్దలూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని ఉమాదేవికి విజయోత్సవ అభినందన సభలో ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజా బాబు చేతుల మీదుగా ఆమెకు పురస్కారం మరియు పారితోషికం అందజేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవో పోలా నాగభూషణ్ రెడ్డి, ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎల్. సగీర్ మరియు ఉపాధ్యాయులు, ప్రముఖులు పాల్గొన్నారు.
విద్యార్థిని సాధించిన ఈ విజయాన్ని అందరూ ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదించారు.