
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. సుమారు 1.91 కోట్ల రూపాయల నుడా (NUDA) నిధులతో 3, 16, 20, 22, 24, 25, 26 మరియు 30వ డివిజన్లలోని వివిధ ప్రాంతాలలో నూతనంగా నిర్మించబోయే CC రోడ్ల నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపన చేశాను.మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా మేము ముందుకు సాగుతున్నాము. నాణ్యతతో, నిర్ణీత కాల వ్యవధిలో ఈ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం.గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, నుడా నిధులతో కందుకూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం.