
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని తానికొండవారి కొష్టాలుకు చెందిన గల్లా మాధవ కుమారుడు అనిల్ - రోహిణి రమ్య వివాహం ఆదివారం రాత్రి వెంగమాంబ కళ్యాణ మండపంలో జరిగింది.లింగసముద్రం గ్రామానికి చెందిన కిలారి తిరుపతయ్య, రాధ దంపతుల కుమారుడు వెంకట విష్ణువర్ధన్ - శ్రావణి వివాహం లింగసముద్రంలోని కళ్యాణ మండపంలో జరిగింది. ఈ వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. వలేటివారిపాలెం మండల టిడిపి అధ్యక్షుడు మాదాల లక్ష్మీనరసింహం, పట్టణ మాజీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు, లింగసముద్రం మండల మాజీ అధ్యక్షులు వేముల గోపాలరావు, పార్టీ నాయకులు అడపా రంగయ్య, అడపా నరసయ్య, మంగపాటి శ్రీను తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.