
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సోమవారం సాయంత్రం మూలగుంటపాడు గోల్డెన్ కేఫ్ దగ్గర లారీ ఆటో ను, మోటార్ బైక్ ను ఢీకొన్న ఘటనలో తండ్రి కొడుకులు తీవ్రంగా గాయపడడం జరిగింది. తీవ్రంగా గాయపడ్డ తండ్రి చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ప్రమాద సమయంలో తండ్రి కొడుకుల వద్ద 9 లక్షల రూపాయల నగదు ఉండడాన్ని గమనించిన 108 సిబ్బంది వేణు ,సౌజన్య లు ఆ నగదును రిమ్స్ వైద్యశాలలో అప్పగించారు. ఈ సందర్భంగా 108 ఉద్యోగుల నిజాయితీని మెచ్చుకొని వారిని ఘనంగా సన్మానించి అభినందించిన సింగరాయకొండ పిహెచ్సి డాక్టర్ వీరేందర్, డాక్టర్ వంశీధర్ . ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు