
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
హనుమత్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆంజనేయస్వామి ఆలయాల్లో, సీతారాముల ఆలయాల్లో వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో భాగంగా సింగరాయకొండ రైల్వే స్టేషన్ రోడ్డు రామాలయం వీధిలో ఆలయ అర్చకులు సాయి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. భారీగా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీగా అన్న ప్రసాదం పంపిణీ చేశారు